హైదరాబాద్, ఆగస్టు 3 : రాజధానిలో జూబ్లిహిల్స్ లోని ఓ పబ్ లో ముజ్రా పార్టీ పై టాస్క్ ఫోర్స్ పోలీసుకు దాడులు చేశారు. ఈ దాడిలో మేనేజర్ పద్మనాభం సహా 19 మందిని అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ పోలీసుల దాడుల్లో ఏడుగురు యువతులు, 11 మంది యువకులు పట్టుపడ్డారు. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిథి పబ్ హైడ్రోజన్ లో ముజ్రా పార్టీ జరుగుతున్నదన్న సమాచారంతో టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహించారు. ముంబైకి చెందిన ముగ్గురు, హైదరాబాద్ కు చెందిన నలుగురు యువతులు నృత్యాలు చేస్తుండగా నగరానికి చెందిన 11 మంది యువకులు జల్సాలు చేస్తుండగా ఈ దాడి నిర్వహించినట్లు తెలుస్తోంది. పబ్ మేనేజర్ పద్మనాభం సహా వీరందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 4 వేలు నగలను స్వాధీనం చేసుకున్నట్లు, యువతలను స్టేట్ హోం కు తరలిస్తామని, పబ్ యజమాని పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.