అమరావతి, ఫిబ్రవరి 26: నేడు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఏపీలోని కడప, కర్నూలు జిల్లాలో నేటి నుండి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. గవర్నర్ ఈరోజు కర్నూలు జిల్లా రుద్రవరం, అహోబిలం వెళ్లనున్నారు. 26న రాత్రి అహోబిలంలోనే బస చేయనున్నారు. ఇక 27వ తేదీ మధ్యాహ్నం తిరిగి కడప స్టేట్ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. 28న ఉదయం 6 గంటలకు కడప జిల్లా ఒంటిమిట్టకు పయనమవుతారు. అక్కడ ఒంటిమిట్టలో కోదండరాముని దర్శనం చేసుకుంటారు. స్వామి దర్శనం అనంతరం తర్వాత తిరిగి హైదరాబాద్ పయనమవుతారు. గవర్నర్ పర్యటనకు రానుండటంతో అసవరమైన అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.