అమరావతి, ఫిబ్రవరి 22: టాస్క్ఫోర్స్, ఎయిర్పోర్ట్ పోలీసులు గుట్టుగా సాగుతున్న వ్యభిచార గృహన్ని పట్టుకున్నారు. ఈ ఘటన కాకానినగర్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మహిళలతో పాటు ఇద్దరు విటుల్ని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కాకానినగర్ బస్టాప్ వెనకనున్న ఇంట్లో కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం సాగిస్తున్నారు.
పక్కా సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఎస్ఐ వాసునాయుడు, ఎయిర్పోర్ట్ సీఐ జెర్రిపోతుల శ్రీనివాసరావు సంయుక్తంగా దాడి చేశారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 9100 నగదును, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.