సినీనటుడు, సూపర్ స్టార్ మహేష్బాబును జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ ప్రశంసించింది. సినిమా ప్రేక్షకుల నుంచి జీఎస్టీ పేరుతో అదనంగా వసూలు చేసిన రూ. 35.66 లక్షలను వినియోగదారుల సంక్షేమనిధి కి మహేష్బాబు చెల్లించారు.
తమది కాని లాభాన్ని గుర్తించి, తిరిగి చెల్లించినందుకు మల్టీకాంప్లెక్సు సినిమా థియేటర్ (ఏఎంబీ సినిమాస్) యజమానులైన మహేష్బాబు, సునీల్ నారంగ్లను అభినందిస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.
దేశవ్యాప్తంగా ఎవరూ ఇలా బాధ్యతగా జీఎస్టీని వెనక్కు తిరిగి ఇవ్వలేదని, మహేష్బాబు, సునీల్లు అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరుల్లోని థియేటర్ల యజమానులపై ఈ నిర్ణయం సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది.
కాగా మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్ లో బిజీ ఉన్నాడు. తదుపరి సినిమా ఎఫ్ 2 ఫేం అనిల్ రావిపూడి తో దాదాపు ఖరారు అయ్యినట్టే అని ఫిలిం నగర్ లో గుస గుసలు వినబడుతున్నాయి.