భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి మాతృదేశం మీద ఉన్న అభిమానం ఇటీవల జరిగిన ఒక సంఘటన ద్వారా పపంచానికి తెలిసింది. న్యూజిలాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో ఒక అభిమాని గ్రౌండ్ లోకి పరుగెత్తుకుంటూ వచ్చి ధోని కాళ్ళకి నమస్కారం చేయబోతుండగా అతని చేతిలోని జాతీయ పతాకం కింద పడకుండా చాకచక్యంగా పట్టుకొని ధోని అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు తాజాగా ధోని మరోసారి దేశం పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు.
ఇటీవల పుల్వామలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధిక సాయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ధోనీ తనవంతు సాయంగా 7 కోట్ల రూపాయలను అమరులైన జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇచ్చాడు. దీంతో ధోని తన ఉదారగుణంతో మరోసారి అందరికి ఆదర్శంగా నిలిచాడు.