అమలాపురం, ఫిబ్రవరీ 21: టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పుడు అటు రాజకీయంగానూ, ఇటు వర్గాల మద్యగాని తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో దీనిపై అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ప్రజా పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు చింతమనేనిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరించారు.
కాగా చింతమనేని దళితుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడినందుకు ఆయనపై నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. దళితులు రాజకీయాలకు పనికిరారని, వారికీ రాజకీయాలు ఎందుకని ప్రభాకర్ అంటున్నారని రాజ్యాంగం రాసింది అంబేద్కర్ అని.. ఆయన వల్లే చింతమనేని ఎమ్మెల్యే అవ్వగలిగారని అన్నారు. దళితుల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే నాలుక కోస్తానని, కులగజ్జి ఉన్న నేతలందరికీ తగిన బుద్ది చెబుతానని ఈ సందర్బంగా చింతమనేనిని హెచ్చిరించారు. ఇప్పటికే చింతమనేనిపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారని అన్నారు.