ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ మరోసారి విమర్శలు చేసారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్లకు అమరవీరుల హోదా ఇవ్వని కేంద్రం, ఒక వ్యక్తికి మాత్రం రూ. 30వేల కోట్లు కట్టబెట్టిందని రాహుల్ గాంధీ విమర్శించారు.
‘40 మంది జవాన్లు ప్రాణ త్యాగం చేశారు. వారి కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. అయినా ఆ ధీరులకు అమరవీరుల హోదా ఇవ్వట్లేదు. అనిల్ అంబానీని ఉద్దేశిస్తూ ఎప్పుడూ తీసుకోవడమే గానీ ఇవ్వడం తెలియదు. అలాంటి వ్యక్తికి రూ. 30వేల కోట్ల జవాన్ల డబ్బును బహుమతిగా ఇచ్చారు. మోదీ చెబుతున్న ఈ నవభారతానికి స్వాగతం’ అంటూ రాహుల్ చురకలంటించారు. అయితే ఇటీవల భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా అసోంలోని ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్పై ధ్వజమెత్తారు. ‘ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. సైనికుల త్యాగాలు వృథాగా పోవు’ అని అమిత్ షా విమర్శించారు. దీంతో రాహుల్ నేడు ట్విటర్ వేదికగా కేంద్రంపై మండిపడ్డారు.
#twitter1#