హైదరాబాద్, ఫిబ్రవరి 21: ఇటీవల తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ క్యాబినెట్ విస్తరణ చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో నూతన మంత్రులందరు ప్రగతి భవన్కు చేరుకుంటున్నారు. కాగా ఈ సమావేశంలో రేపు ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలపనున్నారు.
ఈ మేరకు సీఎం కెసిఆర్ రేపు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దాంతో పాటు కీలకమైన జీఎస్టీ, అటవీశాఖ సవరణ బిల్లులను మంత్రివర్గం ఆమోదించనుంది. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, 2019 లోక్ సభ ఎన్నికలపై చర్చ జరగనుంది.