కర్నూలుపై కన్నేసిన టీడీపీ ముఖ్యనేతలు..

SMTV Desk 2019-02-21 19:20:04  chnadrababu, kotla suryaprakash reddy, ke krishnamurti, tg venkatesh, sv mohan reddy, nara lokesh

అమరావతి, ఫిబ్రవరి 21: కొద్దీ రోజులుగా కర్నూలు అసెంబ్లీ స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సీట్ పై టీడీపీలోని పలు ముఖ్య నేతలు కన్నువేసారు. ఈ నేపథ్యంలో ఎస్వీ మోహన్ రెడ్డి ఈరోజు అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళి చర్చలు జరిపారు. అనంతరం బయటకొచ్చి మీడియాతో మాట్లాడుతూ... ఏపీ ఐటీ మంత్రి, సీఎం కుమారుడు నారా లోకేష్ కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తనని పోటీ చేయమని చెప్పారన్నారు. ఆయన మాటకు కట్టుబడి ఉన్నానని మోహన్ రెడ్డి తెలిపారు. అలాగే తాను ఏ నేతపై కూడా చంద్రబాబుకు ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. కాగా ఈరోజు జరిగే కర్నూలు పార్లమెంటరీ సమీక్షలో ఈ విషయంపై స్పష్టత వస్తుందని అన్నారు.

అయితే కర్నూలు సీట్ ను ఇటీవల టీడీపీలో చేరిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం, కేఈ కృష్ణమూర్తి కుటుటుంబం, ఎంపీ టీజీ వెంకటేష్ కుటుంబం ఆశిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ సభలో నారా లోకేశ్ కర్నూలు లోక్ సభ నుంచి బుట్టా రేణుకను, అసెంబ్లీ సీటు నుంచి ఎస్వీ మోహన్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. అయితే ఈ విషయంపై స్పందించిన టీజీ వెంకటేశ్ కర్నూలు సీట్ పై అంతిమ నిర్ణయం సీఎం చంద్రబాబుదేనని అన్నారు.