ఎన్టీఆర్ భారీ డీల్...

SMTV Desk 2019-02-21 14:12:05  

ఇప్పుడు సినీ పరిశ్రమలో కొందరు క్రేజ్ ఉన్న హీరోలు ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఉత్పత్తులకు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ విషయంలో సౌత్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు మొదటి స్థానం లో ఉన్నాడు. అయితే ఇప్పుడు కార్పొరేట్ సంస్థల ఎండార్స్మెంట్ విషయంలో జూ. ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు. తాజాగా ఎన్టీఆర్ పార్లే ఆగ్రో సంస్థతో ఒక పెద్ద బిజినెస్ డీల్ సంతకం చేసాడు. ఈ సంస్థ ఉత్పత్తి చేసే యాప్పి ఫీజ్ కూల్ డ్రింక్ ప్రమోషన్ కోసం ఈ సంస్థ తయారు చేస్తున్న ఒక భారీ యాడ్ లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. సౌత్ ఇండియన్ స్టేట్స్ మొత్తానికి ఎన్టీఆర్ పార్లే ఆగ్రో సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ యాడ్ కు సంబంధించి అత్యంత భారీ పారితోషికం ఎన్టీఆర్ కు ఇచ్చినట్లు సమాచారం.

ఉత్తర భారతదేశానికి సంబంధించి అన్ని రాష్ట్రాలలో ఈ యాడ్ లో బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తుంటే దక్షిణ భారత దేశానికి సంబంధించి జూ. ఎన్టీఆర్ ను ఎంపిక చేసారు. ఈ సంస్థకు ప్రచారకర్తగా మారడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఎన్టీఆర్ ఇప్పటికే సెలెక్ట్ మొబైల్స్, బోరో ప్లస్, నవరత్న లాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పార్లే ఆగ్రో సంస్థ మరో ఉత్పత్తి అయిన ఫ్రూటీకి అల్లు అర్జున్, అలియా భట్ ప్రచారకర్తలుగా ఉన్నారు.