ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

SMTV Desk 2019-02-21 13:43:56  Telangana, MLC election Notification, Rajath Kumar

హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం అయిదు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. శాసన సభ్యుల కోటాలో ఎన్నికైన పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, టి.సంతోష్‌కుమార్‌, మహ్మద్‌ సలీం, మహమూద్‌ అలీ పదవీ కాలం పూర్తికావడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఐదో తేదీ వరకు గడువు ఉంది. మార్చి 12న ఎన్నికలు జరగనున్నాయి. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కోడ్ వర్తించదని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి రజత్‌కుమార్ స్పష్టంచేశారు.