ప్రభాస్ కు మాత్రమే ఐ లవ్యూ చెబుతా

SMTV Desk 2019-02-20 20:38:49  

బాహుబలి సినిమాతో ప్రభాస్ కేవలం తెలుగు పరిశ్రమకే కాదు నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సుజిత్ డైరక్షన్ లో సాహో సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత రాధాకృష్ణ డైరక్షన్ లో జాన్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఇదిలాఉంటే కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ తనయ వరలక్ష్మి శరత్ కుమార్ ఒక్క ప్రభాస్ కు మాత్రమే తాను ఐ లవ్యూ అని చెబుతా అని అంటుంది.

ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని.. తాను ఐ లవ్యూ చెప్పాల్సి వస్తే అది కేవలం ఒక్క ప్రభాస్ కు మాత్రమే చెబుతా అంటుంది వరలక్ష్మి. స్టార్ తనయురాలిగా హీరోయిన్ గానే కాదు విలక్షణ పాత్రలను చేస్తూ వస్తున్న ఈ అమ్మడు రీసెంట్ గా విజయ్ సర్కార్ సినిమాలో నెగటివ్ రోల్ లో మెప్పించింది. ఇక బయట కూడా సంచలన స్టేటేమెంట్స్ ఇస్తూ హాట్ న్యూస్ గా మారుతున్న వరలక్ష్మి శరత్ కుమార్ ప్రభాస్ కు మాత్రమే ఐలవ్యూ అని చెబుతుందట. మరి ప్రభాస్ ఆమె లవ్ యాక్సెప్ట్ చేస్తాడా లేదా అన్నది చూడాలి.