హైదరాబాద్, ఫిబ్రవరి 14: తెలంగాణాలో వాతావరణంలో మళ్ళీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా మళ్ళీ వాతావరణం చల్లబడనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడనున్నాయని దానివల్ల వర్షాలు, కొన్ని చోట్ల వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పాకిస్తాన్, తూర్పు భారత రాష్ట్రాల వైపు వీస్తున్న అల్పపీడన గాలుల వలన వాతావరణంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం అక్కడక్కడా ఒక మాదిరి వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.