అమరావతి, ఫిబ్రవరి 13: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితం వరకూ ఏపీ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలి పదవిలో ఉన్న సుంకర పద్మశ్రీకి కాంగ్రెస్ అధిష్ఠానం ఒక ముఖ్యమైన పదవిని అప్పగించింది. ఈ సందర్భంగా ఏపీ పీసీసీ ఉపాధ్యక్షురాలిగా ఆమెను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న సుంకర పద్మశ్రీ స్థానంలో రమణి కుమారిని నియమించిన విషయం తెలిసిందే. కాగా, పద్మశ్రీకి పీసీసీలో స్థానం కల్పించినట్టు సమాచారం. గన్నవరం ప్రాంతానికి చెందిన పద్మశ్రీ పలు నిరసనల్లో ముందు నిలవడంతో పాటు తనదైన శైలిలో అధికార పార్టీపై విమర్శలు గుప్పించడం ద్వారా అధిష్ఠానానికి చేరువయ్యారు.