అమరావతి, ఫిబ్రవరి 13: నేడు అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ముఖ్యమైన అంశాలపై చర్చించారు. అన్నదాత సుఖీభవ పథకం గురించి చర్చించి, కీలక నిర్ణయాలను తీసుకున్నారు. మొదటగా ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ. 10వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఫిబ్రవరి చివరి వారంలో చెక్కులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. రానున్న ఖరీఫ్ నుంచి కౌలు రైతులను కూడా ఆదుకునేలా మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించారు.
కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు...
*రైతు రుణమాఫీ చెక్కులు త్వరితగతిన చెల్లించాలి.
*ఎన్జీవోలు, సచివాలయ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 175 చదరపు గజాల ఇంటి స్థలం.
*చదరపు గజం రూ. 4వేల చొప్పున 230 ఎకరాలు కేటాయింపు.
*జర్నలిస్టులకు ఎకరం రూ. 10 లక్షల చొప్పున 30 ఎకరాలు కేటాయింపు.
*తొలి విడత సీఆర్డీఏకు రూ. కోటి చెల్లిస్తే సొసైటీకి భూమి బదలాయింపు. మిగిలిన మొత్తాన్ని రెండేళ్లలో చెల్లించే వెసులుబాటు.
*డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు. సిమ్ కార్డుతో పాటు మూడేళ్లపాటు కనెక్టివిటీ ఇచ్చేలా పంపిణీ.