వాయిదా పడ్డ జగన్ గృహప్రవేశం..

SMTV Desk 2019-02-12 22:11:45  Jaganmohan Reddy, new house, amaravati, adjourned, ys sharmila

విజయవాడ, ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నూతన గృహప్రవేశ కార్యక్రమం వాయిదా పడింది. ఏపీ రాజధాని అమరావతికి దగ్గరలో తాడేపల్లిలో జగన్ తన నివాసాన్ని నిర్మించుకుంటున్నారు. ఇంటికి దగ్గరలోనే పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మిస్తున్నారు. దాదాపు నిర్మాణ పనులు పూర్తి కావచ్చిన నేపథ్యంలో ఈ నెల 14న ఉదయం 8గంటల 21 నిమిషాలకు నూతన గృహ ప్రవేశం చెయ్యాలని ముహూర్తం నిర్ణయించుకున్నారు. కాగా గృహ ప్రవేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుని కూడా ఆహ్వానించారని సమాచారం.

గృహప్రవేశంకి ముఖ్యమైన వారిని మాత్రమే పిలిచి సింపుల్ గా చేసి, పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం గ్రాండ్ గా చెయ్యాలని ప్లాన్ చేశారు. అయితే జగన్ సోదరి శ్రీమతి షర్మిల ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేనందున గృహ ప్రవేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. సాంప్రదాయ ప్రకారం గృహ ప్రవేశం అప్పుడు సోదరి పాలుపొంగించాల్సి ఉండటంతో షర్మిల అనారోగ్యంతో బాధపడుతున్నందున కార్యక్రమాన్ని వాయిదా వేశారు.