సొంత పార్టీ నేతలపై మండిపడ్డ తెరాస నేత..

SMTV Desk 2019-02-12 20:11:32  trs, kcr, trs leaders, koppula eswar, telangana elections 2018

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోటానికి కారణం సొంత పార్టీ నేతలే అని టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన సొంత పార్టీ నేతలపై ధ్వజమెత్తారు. తెరాస నేతలు ప్రభుత్వ పథకాల్లో కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. ఎవరైనా డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టండని పిలుపునిచ్చారు. తన డబ్బులు తిని తననే మోసం చేశారంటూ టీఆర్ఎస్ పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. ఆయనను టీఆర్ఎస్ పార్టీ దొంగలే బఫూన్‌ను చేశారని వాపోయారు.