పవన్ కి తోడుగా తమిళనాడు మాజీ సీఎస్..

SMTV Desk 2019-02-11 20:57:48  Pavan kalyan, Janasena, AP, rammohan rao, tamilanadu ex-cs, chiranjeevi

అమరావతి, ఫిబ్రవరి 11: తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. నేడు ఆయన కుటుంబ సభ్యులతో కలసి పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు తమకోసం పోరాడే నిజాయితీపరుడైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. అలాంటి సమయంలో పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బలమైన శక్తులు పోటీ పడుతున్నాయని, రాజకీయం చేస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలోని పేదలు, మహిళలు, యువత కోసం పవన్ నిరంతరం కష్టపడుతున్నారని రామ్మోహన్ రావు అన్నారు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ తో పాటు చిరంజీవితోను ఆయన కుటుంబ సభ్యులతోను తనకు మంచి పరిచయం ఉందని వెల్లడించారు. పవన్ కోసం తన సాయశక్తుల మేర పనిచేస్తానని హామీ ఇచ్చారు. పవన్ ను సీఎంగా చూడటానికి ప్రజలతో పాటు తనకు ఆసక్తిగా ఉందన్నారు.