హైదరాబాద్, ఫిబ్రవరి 09: అడవి శేష్ ప్రతీసారి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన కెరీర్ లో జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన చేసిన క్షణం , గూడచారి సినిమాలు మంచి ఇమేజ్ ను తెచ్చి పెట్టాయి. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇంత బిజీ షెడ్యుల్ లో కూడా అడవి శేష్ ఒక సినిమాలో అతిథి పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో బేబీ అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటి లక్ష్మి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర ఒకటి ఉందట. అయితే ఆ పాత్రకి అడవి శేష్ సరిగ్గా సరిపోతాడని సమంతా అతని పేరుని సుచించిందట. దీంతో ఈ పాత్ర గురించి నందిని రెడ్డి, అడవి శేష్ ని సంప్రదించగా ఆయన ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి అడవి శేష్ కూడా బేబీ టీం లో చేరిపోయాడు.