ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదుగురు ప్రియాంకలు

SMTV Desk 2019-02-09 09:29:01  Priyanka Chopra, Wax Statue, Madam tussauds musium, New York

న్యూ యార్క్, ఫిబ్రవరి 09: బాలీవుడ్ భామలు ఒక్కొక్కరిగా మైనపు బొమ్మలుగా దర్శనం ఇస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్ అనుష్క శర్మ విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్‌ మ్యుజియంలో ఉంచారు. తర్వాత దీపిక పదుకొనే విగ్రం కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్ళిన ప్రియాంక చోప్రా విగ్రహం కూడా తాజాగా మేడమ్ టుస్సాడ్స్‌ మ్యుజియంలో దర్శనమిచ్చింది. ప్రియాంక చోప్రా విగ్రహం కేవలం ఒక్క మ్యుజియంలోనే కాకుండా న్యూయార్క్, లండన్, సిడ్నీ, సింగపూర్ లలో కూడా ఉంచనున్నారు. అంటే అందరికి ఒక మైనపు విగ్రహం ఉంటె ప్రియాంకకు మాత్రం నలుగు చోట్ల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు.

తాజాగా ప్రియాంక మొదటి మైనపు విగ్రహాన్ని న్యూ యార్క్ లో ఏర్పాటు చేసారు. తన బొమ్మను చూసి ప్రియాంక ఆశ్చర్యానికి గురయ్యారు. తన మైనపు బొమ్మతో ప్రియాంక ఫోటోలకు పోజులిచ్చింది. ప్రియాంక ని మైనపు బొమ్మని పక్క పక్కనే చూస్తుంటే ఎవరు అసలైన ప్రియాంక అనేది కనుక్కోవడం కొంచెం కష్టంగానే ఉంది. ఈ బొమ్మను స్వయంగా తానే ఆవిష్కరించింది. ప్రస్తుతం ప్రియాంక తను నటించిన హాలీవుడ్ సినిమా ఈజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌ సినిమా ప్రొమోషన్ లో ఉంది. మరోవైపు బాలీవుడ్ లో ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ది స్కై ఈజ్ బ్లూ సినిమాలో నటిస్తుంది.