అమరావతి, ఫిబ్రవరి 08: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణం లో పార్టీలు ప్రచారానలో జోరు పెంచాయి. ఆ నేపథ్యం లో తెలుగు దేశం పార్టీ(టీడీపీ) ఎమ్మెల్యే బొండా ఉమ రాబోయే ఎన్నికలలో టీడీపీకి 150 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేవలం ప్రజల కోసం మాత్రమే నిజాయతీగా పని చేసిన నాయకులే మళ్ళి ఎన్నికవుతారని అన్నారు.
నవ్యాంధ్రలో మొదటి శాసనసభలో ఎమ్మెల్యేగా ఉండటం తన అదృష్టమని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని, కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు 5% రిజర్వేషన్లను కల్పించిన ఘనత టీడీపీదేనని చెప్పారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళిపోతూన్నారో జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం ప్రజాతీర్పును ఉల్లంఘించడమేనని చెప్పారు.