రన్నింగ్‌ ట్రైన్ ఎక్కబోతూ కింద పడిపోయిన సాయి పల్లవి

SMTV Desk 2017-08-02 16:11:12  sai pallavi, fidaa movie shooting, shekhar kammula

హైదరాబాద్, ఆగష్టు 2 : ఇటీవల విడుదలైన "ఫిదా" సినిమా ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. సాయి పల్లవి నటనకి హ్యాట్సాఫ్ చెబుతూ ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. సీఎం కేసీఆర్ సైతం అభినందనలు తెలియజేశారు. ఆమెకు దక్కుతున్న పేరు చూసి దర్శకుడు శేఖర్ కమ్ముల ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా ఈ సినిమా కోసం సాయి పల్లవి ట్రాక్టర్ నడపడం నేర్చుకొని, పొలాల్లో నడిపే సన్నివేశం బాగా చేసిందని ఆమెను అభినందనలతో ముంచెత్తారు. అయితే ఈ సినిమాలో ముందుగా రాసుకున్న సీన్ ప్రకారం పల్లవి పరిగెడుతూ ట్రైన్ ఎక్కాలి. కాని అలా పరిగెడుతూ ట్రైన్ ఎక్కబోయిన ఆమె కింద పడిపోవడంతో కాళ్ళు, చేతులకు గాయపడిందట. అయినా పల్లవి ఆ గాయాలను లెక్కచేయకుండా ఈ సినిమా కోసం అలాంటి ఎన్నో కష్టాలను అనుభవించింది. కాబట్టి ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించి, ఆమెకు పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిందని దర్శకుడు శేఖర్ కమ్ముల తన అభిప్రాయాల్ని వ్యక్త పరిచారు.