డ్వాక్రా సంఘాలకు మరో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..

SMTV Desk 2019-02-07 21:49:38  Chandrababu, ap govt, pasupu kunkuma, good news

అమరావతి, ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పసుపు-కుంకుమ పథకం కింద డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ చేసింది. కాగా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన డ్వాక్రా సంఘాలకు కూడా శుభవార్తను అందించింది. సోమవారం నుంచి కొత్తగా మరో 4.37 లక్షల మందికి పసుపు-కుంకుమ కింద చెక్కులు అందజేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా జనవరి 18కి ముందు ఏర్పడిన డ్వాక్రా సంఘాలన్నింటికీ చెక్కులు అందజేయనుంది. ఈ పథకం కింద మొదటి విడతగా రూ.2,350 కోట్లను వివిధ బ్యాంకులకు పంపించగా.. ఇప్పటి వరకూ డ్వాక్రా మహిళలు రూ.1,093 కోట్ల నిధులను డ్రా చేసుకున్నారు.