మమత ధర్నాలో పాల్గొన్న అధికారులపై కేంద్రం వేటు..

SMTV Desk 2019-02-07 21:38:07  mamata banerjeee, West Bengal, IPS officers

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ శారదా స్కామ్‌ కేసు విచారణలో కోల్ కతా పోలీస్ కమీషనర్ పట్ల సీబీఐ వ్యవహరించిన తీరును నిరసిస్తూ ధర్నా చెప్పట్టారు. అయితే ఈ ధర్నాలో కొందరు ఐపీఎస్ అధికారులు కూడా పాల్గొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ధర్నాలో పాల్గొన్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. కాగా మమత పరభుత్వం నిరాకరించినట్లు సమాచారం. అయితే ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వంలో పని చేయకుండా నిషేధం విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వారి పతకాలను వెనక్కి తీసుకోవాలని కేంద్రం యోచిస్తోంది.