అగ్రిగోల్డ్ బాధితులకు నష్ట పరిహారం..

SMTV Desk 2019-02-07 20:14:32  Agri Gold, Hai land, AP Govt, agri gold properties, good news

అమరావతి, ఫిబ్రవరి 7: అగ్రిగోల్డ్ సంస్థ చేసిన మోసానికి ఎంతో మంది ప్రజలు నష్టపోయారు. కాగా ఇప్పుడు అగ్రిగోల్డ్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ శుభవార్తను అందించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా 3.5 లక్షల మందికి ఊరట కల్పించనుంది. రూ.10 వేల లోపు డిపాజిట్లు ఉన్నవారందరికీ రాష్ట్ర ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.

అయితే అగ్రిగోల్డ్ బాధితులలో రూ.10 వేల లోపు డిపాజిట్లు ఉన్నవారు దాదాపు 3.5 లక్షల మంది ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. కాగా వీరందరికీ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో జిల్లా స్థాయి కమిటీల ద్వారా చెల్లింపులు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.250 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ప్రభుత్వం పరిహారంగా చెల్లిస్తున్న ఈ రూ.250 కోట్లు తరువాత జప్తు చేసిన అగ్రిగోల్డ్ సంస్థల ఆస్తుల నుంచి జమ చేసుకుంటుందో లేదో తెలియాల్సి ఉంది.