భారీ ర్యాలీ నడుమ భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్

SMTV Desk 2017-08-02 14:39:56  Namdyala By poll, By elections namdyala, Namdyala By election 2017, Congress candidate, Namdyala by election TDP, Akhila priya, Bhuma brahmananda reddy

నంద్యాల, ఆగష్టు 2: రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నంద్యాల ఉపఎన్నికల ఫలితాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలన్నీ. ఈ నేపధ్యంలో నంద్యాల యుద్ద భూమిని తలపిస్తుంది. ఇదిలా ఉండగా ఎన్నికల నామినేషన్ గత నెల 29 నుంచి ప్రారంభమైంది. బుధవారం ఉదయం ఈ ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీతో భూమా నాగిరెడ్డి ఇంటి నుంచి బయలుదేరారు. ఈ ర్యాలీలో మంత్రులు కేఈ కృష్ణమూర్తి, భూమా అఖిలప్రియ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం నంద్యాల పురవీధుల్లో ఎక్కడ చూసిన పసుపు రంగు రెపరెపలతో ర్యాలీ ఉత్సాహంగా సాగుతుందని సమాచారం. ర్యాలీ పూర్తయిన తరువాత భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ వేయనున్నారు.