భోపాల్, ఫిబ్రవరి 07: రామాయణం సీరియల్లో రాముడుగా నటించిన అరుణ్ గోవిల్ దేశం ప్రజలను ఆకర్షించి ఎంతో పేరు సంపాదించుకున్నాడు. 1980వ దశకంలో రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణం ఎంతో పాపులర్ అయింది. రాముడిగా అరుణ్ నటకు యావత్ దేశం ఫిదా అయింది. రానున్న లోక్ సభ ఎన్నికలలో అరుణ్ గోవిల్ పాల్గొననున్నారు. త్వరలోనే కాంగ్రెస్లో చేరబోతున్న అరుణ్ గోవిల్ సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి బరిలోకి దిగబోతున్నట్టు సమాచారం.
ఇండోర్ బీజేపికి కంచుకోటగా మారింది. ఇండోర్లో కాంగ్రెస్ ఎన్నిసార్లు పాగా వెయ్యాలని చూసిన బీజేపి నెగ్గనివ్వలేదు. దాదాపు 8 సార్లు కాంగ్రెస్ ఓటమి పాలైంది. కానీ ఈసారి గట్టి పోటితో కాంగ్రెస్ అక్కడి నుండి అరుణ్ను బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఎంపీ, ప్రస్తుత లోక్సభ స్పీకర్ అయిన సుమిత్రా మహాజన్క ఇండోర్లో గట్టి పట్టుంది. అక్కడ ఆమెన ఎదుర్కొని గెలవడం కాంగ్రెస్కు సవాలుగా మారింది. పదిహేనేళ్ల తర్వాత మధ్యప్రదేశ్లో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోక్ సభ ఎన్నికలలో సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది.