అసోం ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్న బీజేపీ

SMTV Desk 2019-02-07 09:52:10  Himantha Bishwa Sharma, BJP, Assam

పాట్న, ఫిబ్రవరి 07: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాష్ట్రాల పార్టీలు తమదైన శైలిలో ప్రజలను ఆకట్టుకోవాడికి పాట్లు పడుతూ, తాయిలాలను ప్రకటిస్తున్నారు. మరో వైపు అసోంలో బీజేపీ ఇంకో అడుగు ముందుకేసి వరాల జల్లు కురిపించింది. పేదింటి అమ్మాయిల పెళ్ళిలకు రూ. 38 వేల విలువైన బంగారాన్ని కానుకగా ఇస్తామని ఆ పార్టీ రాష్ట్ర నేత, ఆర్థికమంత్రి హిమంత బిశ్వాశర్మ తెలిపారు.

ఆర్థికమంత్రి మాట్లాడుతూ, పదవ తరగతిలో ఫస్ట్ క్లాస్ సాధించిన అమ్మాయిలకు ఈ-బైక్ లను కానుకగా ఇస్తామని అన్నారు. అమ్మాయి చదువు కోసం రూ. 50 వేలు ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కళాకారులు, క్రీడాకారులకు ఒక్కొక్కరికీ రూ. 50 వేల ఇన్సెంటివ్ ను, 45 ఏళ్ల లోపు వయసున్న వితంతువులకు రూ. 25 వేల ఆర్థిక సాయం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆలయాల పునరుద్ధరణ కొరకు రూ. 10 లక్షల చొప్పున గ్రాంట్ ఇస్తామని కూడా వరమిచ్చారు.