పాకిస్థాన్ లో హిందూ దేవాలయం కూల్చివేత : పాక్ ప్రధాని మండిపాటు

SMTV Desk 2019-02-06 20:49:43  Imran Khan, India, Pakistan, hindu temple

పాకిస్థాన్, ఫిబ్రవరి 06: పాకిస్థాన్ సింథ్ ప్రావిన్స్ లోని ఖైరాపూర్ జిల్లాలోని హిందూ దేవాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చి వేశారు. దీనిపై పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా మండిపడ్డారు. కాగా దీనిపై పోలీసులు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు అక్కడి హిందూ సమాజం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ సలహాదారు రాజేశ్ కుమార్ హర్దసనీ మాట్లాడుతూ.. పాక్ లోని హిందూ దేవాలయాల పరిరక్షణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మతసామరస్యానికి భంగం కలిగించే యత్నాల్లో భాగంగానే గుర్తుతెలియని వ్యక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారని ఆరోపించారు.

అయితే హిందూ ఆలయ కూల్చివేత ఘటనపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెెంటనే విచారణ ప్రారంభించాలని సింథ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. తమ పవిత్ర గ్రంథం ఖురాన్ కు ఇలాంటి చర్యలు వ్యతిరేకమని, నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.