హైదరాబాద్, ఫిబ్రవరి 06: తెలంగాణాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు కన్ను వేసాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం లోక్ సభ స్థానంపై కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. అక్కడి నుంచి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతిని పోటీ చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవతారాయ్ మాట్లాడుతూ.. ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి విజయశాంతి పోటీ చేస్తానంటే స్వాగతిస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారిణిగా, ప్రముఖ నటిగా విజయశాంతికి మంచి గుర్తింపు ఉందన్నారు.
ఓ కార్యక్రమం నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన మానవతారాయ్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రధాని కావడం కోసం, విజయశాంతి గెలుపు కోసం తాను కృషిచేస్తానని తెలిపారు. ఈసారి వరంగల్ లోక్ సభ స్థానం నుంచి తాను పోటీ చేస్తాననీ, ఆ సీటు తనకు ఇవ్వాల్సిందిగా పార్టీ అధినేత రాహుల్ గాంధీని కోరుతానని మానవతారాయ్ అన్నారు.