షియోమీ తక్కువ ధరలతో ఎక్కువ ఫీచర్లు అందించిన చైనా మొబైల్ సంస్థ. ఇపుడు షియోమీ తన పాపులర్ బ్రాండ్ స్మార్ట్ఫోన్లపై ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పరిమిత కాలం ఆఫర్గా ఈ డిస్కౌంట్ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఫిబ్రవరి 6 నుంచి 8వ తేదీవరకు ఈ ఆఫర్ ఉంటున్నట్లు షియోమీ ట్విట్టర్ దవారా అనౌన్స్ చేసింది. రెడ్మి 6, రెడ్మి 6ఏ, రెడ్ మి 6 ప్రొ ధరలపై రూ.500 నుంచి 2వేల దాకా తగ్గింపును ప్రకటించింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, షావోమి ఈ స్టోర్లలో ఈ తగ్గింపు రేట్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది.
Time for some Real deals! As a 'M'illennial be smart and choose wisely! pic.twitter.com/jWc3bnTxrz
— Redmi India (@RedmiIndia) February 5, 2019