ఏటీఎం యంత్రాన్ని దొంగిలించిన ఆగంతకులు

SMTV Desk 2019-02-06 10:45:51  ATM Machine, Car, Bodh Gaya, Theft

పాట్న, ఫిబ్రవరి 06: గుర్తు తెలియని ఆగంతకులు ఏటీఎం యంత్రాన్ని దొంగిలించి కార్ లో తీసుకొని వెళ్లారు. ఆ కారు టైరు పంక్చర్ కావడంతో నడి రోడ్డులో వదిలేసి వెళ్ళిపోయారు. ఈ ఘటన బీహార్‌లోని బోధ్‌గయకు చెందిన ధర్మారణ్య సమీపంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కారు అనుమానాస్పద రీతిలో కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా రోడ్డు మధ్య లో ఈ ఏటీఎం కలిగిన కారు నిలిచివుండటంలో జనం వింతగా చూడటం ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న పోలిసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సరిచేశారు.

పోలిసుల కథనం ప్రకారం ఈ ఏటీఎం ఘుఘరీటాండ్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందినది. ఇది విష్ణుపథ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉంది. కారు టైరు పేలి ఆగిపోయిన నేపధ్యంలో జనం గుమిగూడటంతో ఆగంతకులు ఆ కారును అక్కడే వదిలేసి చల్లగా జారుకునివుండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏటీఎం యంత్రాన్ని కట్‌చేసేందు‌కు వినియోగించిన గ్యాస్‌కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.