విజయనగరం జిల్లాలో సర్వేరాయుళ్ల హల్‌చల్‌

SMTV Desk 2019-02-06 08:31:41  Survey Persons, Vijayanagaram, TDP, YCP

అమరావతి, ఫిబ్రవరి 06: విజయనగరం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైసిపి ఓట్లు తొలగిస్తున్నారని ఓటర్లు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి రామభద్రపురం మండలంలో సర్వేరాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఓట్లు తొలగించే తీరు గురించి ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు దేశం పార్టీ(టీడీపి) నాయకులే ఈ భాగోతానికంతటికీ కారణమని పలువురు స్పష్టం చేశారు. రామభద్రపురం మండల కేంద్రంలోని సర్వే జరుపుతున్న వ్యక్తిని స్థానిక టీడీపీ ముఖ్య నాయకుడు ఒకరు శ్రీరాంనగర్‌ కాలనీకి మంగళవారం తీసుకెళ్లి సర్వే వివరాలు అడిగారు.

ఆ కాలనీకి చెందిన కొందరు ఆ దొంగ ఓటర్ల సర్వే వ్యక్తి దగ్గర ఉన్న ట్యాబ్‌ను లాక్కొని సర్వేను తీవ్రంగా ఖండించారు. టీడీపీ ప్రముఖ నాయకులై కూడా ఈ పని చేయడం మంచిది కాదని ఆ నాయకుడిని నిలదీశారు. దీనికి మద్దతుగా టీడీపీ నాయకులూ ఇంటింటికీ తిరుగుతున్న సర్వే రాయుళ్లకు రక్షణ కల్పిస్తూ దగ్గరుండి తీసుకువెళ్లారు. ఆ సర్వే వ్యక్తులకు స్థానిక టీడీపీ కార్యాలయంలో భద్రత కల్పిస్తూ కూర్చునేందుకు సౌకర్యాలు కల్పించారు. వైసిపి ఓట్లు తొలగిస్తున్నారన్న బలమైన ఆరోపణలకు ఇదే తార్కాణం అని పలువురు పేర్కొన్నారు.