కోల్కతా, ఫిబ్రవరి 5: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టిన దీక్ష గురించి తెలినదే. అయితే ఈరోజు ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోల్కతా వెళ్లి మమతా బెనర్జీని కలవనున్నారు. కేంద్ర ప్రభుత్వ పద్దతిని నిరసిస్తూ ఆమె చేపట్టిన ‘సత్యాగ్రహ’ దీక్షకు సంఘీభావం తెలపనున్నారు. ఈ రాజకీయ పరిణామానికి కారణమైన శారదా, రోజ్వ్యాలీ చిట్ఫండ్ స్కాంలపై దర్యాప్తు కొనసాగించడానికి సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టు సీబీఐని ఆశ్రయించింది. సీబీఐ పిటిషన్ను నేడు విచారించనున్న న్యాయస్థానం నిర్ణయాన్ని ప్రకటించనుంది.
ఇందువల్ల ఇప్పుడు అందరి దృష్టి సుప్రీంకోర్టుపై పడింది. సీబీఐకి అనుకూలంగా తీర్పు వస్తే కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ను సీబీఐ ప్రశ్నిస్తుంది. వ్యతిరేకంగా వస్తే మమత గెలిచినట్టు అవుతుంది. మరోవైపు, బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. మోదీ, అమిత్ షా దిష్టి బొమ్మల్ని దహనం చేస్తున్నారు.