హైదరాబాద్, ఫిబ్రవరి 4: ప్రముఖ నటుడు డా. రాజశేఖర్ సతీమణి జీవిత రాజశేఖర్ తనపై ఓ వ్యక్తి దాడి చేశారంటూ బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో పిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. కౌశిక్ అనే వ్యక్తి దాడి చేశాడంటూ ఏసీపీ కార్యాలయంలో జీవితా రాజశేఖర్ పిర్యాదు చేశారు. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జీవితా రాజశేఖర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.