హైదరాబాద్, ఫిబ్రవరి 4: యూత్ ఐకాన్, టాలీవుడ్ యువ హీరో విజయ దేవరకొండకు అరుదైన ఘనత దక్కింది. 2019 ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 లో చోటు దక్కించుకొని అరుదైన పురస్కారాన్ని పొందాడు. భారత్ లో 30 ఏళ్ల కన్నా.. తక్కువ వయసుకి చెంది, తమ తమ రంగాల్లో అధ్బుత ప్రతిభని కనబరిచిన వారి జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది. ఈ లిస్ట్ లో విజయ్ స్థానం దక్కించుకున్నాడు. ఇదే జాబితాలో ప్రజాత్ కోలి(యూట్యూబర్), మేఘన మిశ్రా(సింగర్), ప్రముఖ మహిళా క్రికెటర్ స్మృతి మంధాస, ప్రముఖ అథ్లెట్ హిమాదాస్ లు చోటు దక్కించుకున్నారు.
2018లో విజయ్ నటించిన టాక్సీవాలా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. అలానే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వరుస విజయాలతో దూకుడు మీదున్న ఈ నటుడు ఇటీవల తన రెమ్యునరేషన్ కూడా పెంచి ఇప్పుడు రూ.10 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.