హైదరాబాద్, ఫిబ్రవరి 3: దిల రాజు తనయుడు శిరీస్ ను త్వరలో ఇండస్ట్రీ కి హీరోగా పరిచయం చేయనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసుకున్న ఈ సినిమాకు "పలుకే బంగారమాయె" అనే టైటిల్ కూడా పెట్టారు. ఈ సినిమాతో సతీష్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం కానున్నాడు. మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నాడు దిల్ రాజు. అయితే దిల్ రాజు కి, దిల్ రాజు ఫ్యామిలీ కి సంక్రాంతి పండగ అచ్చొచ్చింది. అలాంటి సంక్రాంతి పండగ రోజే తన వారసుణ్ణి కూడా తెర పై ప్రేక్షకులకి చూపించాలి అనేది దిల్ రాజు ప్లాన్. ప్రస్తుతం దిల్ రాజు మహేష్ బాబు హీరోగా వస్తున్న "మహర్షి" షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.