ఏపీ 2022లో దేశస్థాయికి....2050లో ప్రపంచస్థాయికి వెళ్లనుంది : ఏపీ సీఎం

SMTV Desk 2019-02-03 19:08:35  Andhrapradesh, New high court, Chandrababu

అమరావతి, ఫిబ్రవరి 3: ఆదివారం ఆమరావతిలో ఏపీ సర్కార్ ఎంతో ప్రతిస్టాత్మకంగా నిర్మించిన తాత్కాలిక హై కోర్ట్ భవన ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రంలో ఆయన మాట్లాడుతూ 2022 నాటికి ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్ర రాష్ట్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాక 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందన్నారు. కోరర్టుల్లో 1.70 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కేసులు వేగవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అమలు చేస్తామన్నారు.

ఏపీలో రానున్న నవ్య ఆవిష్కరణలు న్యాయ వ్యవస్థకు కూడా దోహదం చేస్తాయన్నారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతి రహిత పాలన అందిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో నల్సార్‌ ఏర్పాటుకు ఎంతో కృషి చేశానని, అమరావతిలో కూడా నల్సార్‌ ఏర్పాటుకు సుప్రీం కోర్టు సహకరించాలన్నారు. నల్సార్‌ ఏర్పాటుకు అవసరమైన భూమి ఇస్తామన్నారు.