హైదరాబాద్, ఫిబ్రవరి 2: కాంగ్రెస్ పార్టీ లో విభేదాలు మళ్ళీ మొదలయ్యాయి. నేడు గాంధీ భవన్ లో సీఎల్పీ నేత భట్టీ విక్రమార్కకు సన్మాన సభ ఏర్పాటు చేసారు. కానీ భట్టీ విక్రమార్క సన్మాన సభ కాంగ్రెస్ నేతల గొడవతో రసాభాసగా మారింది. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు (వీహెచ్), నూతి శ్రీకాంత్ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో ఇరువర్గాల కార్యకర్తలు పరస్పర దాడికి దిగారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట నియోజక వర్గం నుండి శ్రీకాంత్ కు టికెట్ రాకుండా విహెచ్ అడ్డుపడ్డాడని నూతి శ్రీకాంత్ వర్గీయులు.. వీహెచ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో శ్రీకాంత్, వీహెచ్ వర్గీయులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమం లో కార్యకర్తలు వోకరిపై వొకరు కుర్చీలు విసురుకున్నారు. భట్టి విక్రమార్క ఆధ్వర్యం లోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. భట్టీ సర్ధి చెబుతున్నా వినని కార్యకర్తలు మరింత రెచ్చిపోవటంతో సన్మాన సభ అర్థాంతరంగా ముగిసింది.