న్యూఢిల్లీ, ఆగష్టు 1: ఆసియాలో అత్యంత ధనవంతుల జాబితాలోని రెండవ స్థానంలో ఉన్న లీ కషింగ్ని ముకేష్ అంబానీ అధిగమించారు. ఆయన 2వ స్థానం సాధించడానికి జియో అమ్మకాలే ఏకైక కారణమని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది అంబానీ ఆదాయం రూ. 77000 కోట్లని బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ నివేదిక తెలిపింది. దీనికి తోడు, రిలయన్స్ ఫీచర్ ఫోన్ వలన రిలయన్స్ తమ రాబడిని మరుసటి సంవత్సరం ఇంకా పెంచుకోగలదని బ్లూమ్ బెర్గ్ అభిప్రాయపడ్డాడు. మొదటి స్థానంలో చైనా యొక్క ఆలీబాబా ఇ-కామర్స్ వెబ్సైట్ వ్యవస్థాపకుడు జాక్ మాయా, మూడవ స్థానంలో హాంగ్ కాంగ్ పారిశ్రామికవేత్త లీ కషింగ్ ఉన్నారని నివేదిక వెల్లడించింది.