జైపూర్, జనవరి 31: రాజస్తాన్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి మరొక విజయం చేరింది. రాజస్థాన్లో గత సంవత్సరం డిసెంబర్ 7న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు రామ్గఢ్లో బీఎస్పీ అభ్యర్థి మృతితో ఆ నియోజకవర్గ ఎన్నిక వాయిదా పడింది. తిరిగి ఈ నెల 27న ఎన్నిక నిర్వహించి.
కాగా ఓట్ల లెక్కింపు ఈరోజు నిర్వహించింది. ఈ నియోజకవర్గం నుండి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి షఫియా జుబేర్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి సువంత్ సింగ్పై 12 వేల ఓట్ల మెజారిటీతో జుబేర్ గెలుపొందారు. జుబేర్కు 83,311 ఓట్లు, సువంత్కు 71,083 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7న జరిగిన ఎన్నికల్లో 99 సీట్లు సాధించగా ఇప్పుడు ఆ సంఖ్య 100కు చేరుకుంది.