హైదరాబాద్, జనవరి 31: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేకర్ రెడ్డి జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమా యాత్ర . మళయాళ మెగాస్టార్ మమ్మూట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సినిమా విడుదల ఆపాలంటూ పిటిషనర్ కోర్టుని కోరారు. కేసుని విచారించిన హైకోర్టు ఈ నెల 6కి విచారణ వాయిదా వేసింది. ఈ సినిమా మొత్తం వైఎస్ పాదయాత్ర చుట్టూ తిరగనుందని దర్శకుడు మహి వి రాఘవ్ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సినిమాలో ఎటువంటి కాంట్రవర్సీలు కూడా ఉండవని పరోక్షంగా చెప్పారు.
సినిమాలో వైఎస్ ప్రత్యర్ధుల పాత్రలు కూడా ఉండవని అన్నారు. సెన్సార్ బోర్డ్ కూడా ఎలాంటి కట్స్ చెప్పకుండా సినిమాను సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేసింది. ఫిబ్రవరి 8న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు యూనిట్ ప్రకటించింది. కానీ ఊహించని విధంగా ఇప్పుడు సినిమాపై కేసు పెట్టారు. మరి ఈ సినిమా విడుదలపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!