మావోయిస్టుల చేతిలో ఓ వ్యక్తి దారుణ హత్య

SMTV Desk 2019-01-31 13:20:27  Maharashtra, Telangana, AP, Maoists killed a man, Bharath Bandh

మహారాష్ట్ర. జనవరి 31: మావోయిస్టులను పట్టుకునేందుకు భద్రత బలగాలు ఆపరేషన్ సమాధాన్ ను చేపట్టారు. దీనికి నిరసన వ్యక్తం చేస్తూ మావోయిస్టులు ఈరోజు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. పోలీస్ ఇన్ఫార్మర్ అనే అనుమానంతో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన వలెవంజ కుజెమి(50) అనే వ్యక్తిని ఇంటి నుంచి కిడ్నాప్ చేసారు. తర్వాత ప్రజా కోర్టులో విచారించి అతను పోలీస్ ఇన్ఫార్మర్ గా పని చేస్తున్నట్లు తేల్చారు.

అనంతరం పెనుగుండ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి తుపాకీతో కాల్చిచంపి, పోలీస్ ఇన్ఫార్మర్ గా పని చేసినందుకే చంపేశామని వొక కర పత్రం లో రాసి మృతదేహం పై వదిలి వెళ్లారు. మరోవైపు భారత్ బంద్ తో పాటు మావోయిస్టుల వారోత్సవాలు కూడా జరుగుతున్నందున ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు భద్రతా బలగాలు అతవీ ప్రాంతంలో కాపు కాశారు.