లక్నో, జనవరి 31: భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ 71వ వర్ధంతి సందర్బంగా దేశావప్తంగా ఆయనకు గనంగా నివాళులర్పిస్తున్నారు. కాని యూపిలోని అలీగఢ్ లో గాడ్సే మాతృసంస్థ హిందూ మహాసభ గాంధీజీని దారుణంగా అవమానించింది. ఆ సంస్థ ద్వారా ఏర్పాటు చేయబడిన ఓ కార్యక్రమంలో సభ్యులందరూ చప్పట్లు కొడుతూ, హర్షధ్వానాలు చేస్తుండగా, జాతీయ కార్యదర్శి పూజా శకున్ పాండే, గాంధీజీ చిత్రపటాన్ని తూపాకి తీసుకుని కాల్చారు. ఆ తారువాత అక్కడున్న వారు మహాత్మా నాథూరాం గాడ్సే అమర్ రహే అని నినాదాలు చేశారు. ఆపై గాంధీ దిష్టిబొమ్మను కాల్చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ పూజా శకున్ పాండే మహాత్మా గాంధీ వర్ధంతిని తాము పునఃసృష్టించామని, దీని ద్వారా సరికొత్త సంప్రదాయానికి నాందిపలికామని తెలపడం గమనార్హం. ప్రతి ఏడాది విజయదశమి నాడు రావణాసురుడి బొమ్మను దహనం చేసినట్టుగానే ఇకనుంచి గాంధీ దహనమూ కొనసాగుతుందని పేర్కొన్నారు.