వాయిదా పడ్డ కోడికత్తి కేసు..

SMTV Desk 2019-01-30 19:41:58  Jaganmohan Reddy, srinivas, NIA, AP High court, attack

విజయవాడ, జనవరి 30: జగన్ పై జరిగిన దాడి కేసుపై (కోడికత్తి కేసు) ఏపి హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఈ కేసులో గతంలోనే ఎన్‌ఐఏ విచారణపై రాష్ట్రప్రభుత్వం సిట్‌ ఫైల్‌ చేసింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు సూచించింది. దీంతో ఈరోజు ఎన్‌ఐఏ కౌంటర్‌ దాఖలు చేసింది. కాగా కౌంటర్‌ దాఖలు చేసేందుకు సిట్‌ తరపు లాయర్‌ వారం రోజుల సమయం కోరగా కేసు వాయిదా పడింది. దాంతో హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.