హైదరాబాద్, జనవరి 30: రోమియో చిత్రంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ తమిళ హీరో శివ కార్తికేయన్ ఇప్పుడు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివ కార్తికేయన్ హీరోగా , సమంత, కీర్తిసురేష్ హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం సీమరాజు . ఈ సినిమా తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో విడుదల చేయాడానికి రంగం సిద్దం చేసుకున్నారు సినీ బృందం. ఈ సినిమాకు తమిళంలో పొన్రమ్ దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత ఆర్డి రాజా 24 ఏమ్ స్టూడియోస్ బ్యానర్లో నిర్మించారు.
అయితే ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత సాయి కృష్ణ పెండ్యాల సాయికృష్ణా ఫిలింస్ ద్వారా విడుదల చేయడానికి సిద్దమయ్యారు. ఈ సినిమాకు ఇమ్మాన్ సంగీతం అందించారు. ఈ సందర్భంగా సాయికృష్ణా మాట్లాడుతూ, రోమియో చిత్రం ఏవరేజ్గా ఆడింది కానీ టివిలో మాత్రం బ్లాక్బస్టర్ గా నిలిచిందన్నారు. ఆ చిత్రంతో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడన్నారు. ఆయన నటించిన సీమరాజ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నామని తెలిపారు. అతి త్వరలోనే ఆడియోను రిలీజ్ చేస్తామని ఫిబ్రవరి 8న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చెప్పారు.