పనాజి, జనవరి ౩౦: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం రోజున కేంద్ర మాజీ రక్షణ మంత్రి, గోవా ముఖ్యమంత్రి అయిన మనోహర్ పారికర్ ను కలిసిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ సమావేశం అనతరం మాట్లాడుతూ, తను కేవలం వ్యక్తిగత పర్యటనగా గోవా వచ్చానని తెలిపారు. ఈ మాటలు చెప్పిన కొన్ని గంటల వ్యవదిలోనే రాహుల్ రాఫెల్ డీల్ పై మరోసారి ధ్వజమెత్తారు. కొత్తగా రాఫెల్ డీల్ గురించి చెప్పాల్సిందేమీలేదని పారికర్ తనతో చెప్పారని అన్నారు. ప్రధాని మోడీ తన మిత్రుడు అనిల్ అంబానీకి మేలు చేసేందుకు కుదుర్చుకున్న వొప్పందంపై మాట్లాడేదేముందని పారికర్ అన్నారని రాహుల్ తెలిపారు.