ఉత్తరప్రదేశ్, జనవరి 30: ప్రముఖ పాప్ సింగర్ శివాని భాటియా యూపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరుణం చెందింది. మధురలోని జనపథ్ వద్ద ప్రయాణిస్తున్న ఈమె కారును వెనకనుండి ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఈమెతో పాటు ప్రయాణిస్తున్న భర్త నిఖిల్ భాటియా గాయాలపాలయ్యారు.
బీహార్ కు చెందిన శివానీ భాటియా చాలా కాలంగా ఢిల్లీ లాజ్ పత్ నగర్ లో భర్తతో బాటు నివసిస్తోంది. స్థానికంగా పాప్ గాయనిగా ఆమె ఎంతో పాపులర్ అయింది. ఆగ్రాలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆమె వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది.