కొత్తగూడెం బొగ్గు గనిలో అర్జున్ రెడ్డి

SMTV Desk 2019-01-29 19:16:00  Vijay devarakonda, Dear comrade, Shooting spot, Kottagudem mine

కొత్తగూడెం, జనవరి 29: యూత్ స్టార్ విజయ దేవరకొండ తన డియర్ కామ్రేడ్ సినిమా చిత్రీకరణ చాలా వేగంగా పూర్తి చేస్తున్నాడు. ఈ మధ్యే కాకినాడలో షెడ్యూల్ పూర్తి చేసుకొని ప్రస్తుతం కొత్తగూడెం లోని సింగరేణి కాలరీస్ లో చిత్రీకరణ కొనసాగుతుంది. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి తో పాటు మరో సారి జోడి కట్టనుంది గీత గోవిందం బ్యూటీ రష్మిక మందన్న. ఈ సినిమాకు భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. మీరు ప్రేమించే దానికోసం యుద్ధం చేయండి.. ఫైట్ ఫర్ వాట్ యు లవ్.. అనే ట్యాగ్ లైన్ తో డియర్ కామ్రేడ్ సినిమా వస్తుంది. స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఎమోషనల్ డ్రామా ఈ చిత్రం.





ఇందులో విజయ్ దేవరకొండ సామాజిక బాధ్యత కలిగిన యువకుడిగా, కార్మిక నేతగా వొక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్‌ చెరుకూరి, యశ్‌ రంగినేని కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. వేసవిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.