నాకు మాట్లాడే అవకాశం జగన్ ఇవ్వట్లేదు : స్పీకర్

SMTV Desk 2019-01-29 17:49:01  Jaganmohan Reddy, ap asembly, kodela siva prasad, speaker

అమరావతి, జనవరి 29: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదనే అసంతృప్తి తనలో ఉందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. సభలో అధికార, ప్రతిపక్షాలు రెండూ ఉంటేనే స్పీకర్ కు సవాల్ గా ఉంటుందని చెప్పారు. కాగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఈసారి కూడా పిలుస్తామని తెలిపారు. అయితే, జగన్ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు.

అయితే అసెంబ్లీకి ప్రతిపక్ష పార్టీ ఎందుకు హాజరు కావడం లేదో తనకు తెలియదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ కు బదులు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది... అలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టదని తాను భావిస్తున్నట్లు తెలిపారు.